ఆర్ధిక సహాయం చేసిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

0
24 Views

వికారాబాద్ : ఆదివారం రాత్రి  ఆలంపల్లిలో మలుపు వద్ద ప్రమాదవశత్తు లారీ అదుపుతప్పి ఇండ్లలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ  విషయం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి  ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ. గడ్డం. ప్రసాద్ కుమార్ మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలు అక్కడి కుటుంబలకు సంబందించిన వ్యక్తులకు అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వం ఈ నీరుపేద కుటుంబలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన రెండు కుటుంబల వారికి 15000వేల నగదు సహాయం చేసారు.. ఈ సందర్బంగా సీనియర్ నాయకులు v. సత్యనారాయణ,కిషన్ నాయక్, హాజీ, కాలేద్,ఆనంద్, శ్రీనివాస్ ముదిరాజ్, రజినీకాంత్, విజయ్ కుమార్, బాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.