రూ. 1.06 కోటి ధర పలికిన గంగారం భూమి ….కొనుగోలు చేసిన కోకాపేట జాయ్ వెంచర్స్ యాజమాని శ్రీకాంత్ రెడ్డి….. గంగారం రైతుల ఆందోళన

0
16 Views

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో గంగారం వద్ద అమ్మకానికి ఉంచిన  మూడున్నర ఎకరాల భూమి వేలం పాటను సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్దబహిరంగ వేలం నిర్వహించారు. వేలం పాటలో 50 మంది వరకు పాల్గొనగా గంట పాటువేలం పాటజరిగింది. ఈ వేలం పాటలో కోకాపేట్ పేటకు చెందిన జాయ్ వెంచర్స్ కు చెందిన యాజమాని శ్రీకాంత్ రెడ్డి  రూ.  1. 06 కోట్లకు ఎకరా భూమి చొప్పున మూడున్నర ఎకరాలను కొనుగోలు చేశారు. గంటపాటువేలంపాట జరుగగా అట్టి భూమికి సంబంధించి పట్టాలు మా వద్ద ఉన్నాయని వాటిని ఎలా అమ్ముతారని గంగారం గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేశారు. దీంతోపోలీసులువారిని అరెస్ట్ చేయగా అక్కడ ఉదృత వాతావరణం నెలకొంది. మహిళలను ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించడంతో తాము న్యాయం జరుగక పోతే  ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు బెదరించారు. చివరికి పోలీసులు ఆందోళన చేస్తున్న వృద్ద మహిళలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.