ఎంపీ అరవింద్ నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా: ఎమ్మెల్సీ కవిత

0
11 Views

వికారాబాద్ : బిజెపి ఎంపీ అరవింద్ చెప్పుతో కొడతా అంటూ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యాలు  చేశారు. శుక్రవారం మీడియం సమావేశంలో మాట్లాడుతూ. రాజకీయాలు చేసుకో చిల్లర రాజకీయాలు చేసుకోకు అరవింద్ అంటూ సూచనలు చేశారు .నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు చౌరస్తాలో చెప్పు దెబ్బలు కొడతా అంటూ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. ఎంపీ అరవింద్‌వి చిల్లర మాటలని ఆమె మండిపడ్డారు. నిజామాబాద్ పేరును ఎంపీ అరవింద్ పాడు చేస్తున్నాడని విమర్శించారు. పార్లమెంట్‌లో ఆయన ఫర్మామెన్స్ సున్నా అని.. రాజస్థాన్ యూనివర్శిటీలో చదువుకున్నట్లు అరవింద్ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారని ఆరోపించారు. బురద మీద రాళ్లు వేయకూడదనే అరవింద్ మాటలను పట్టించుకోలేదని.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్లు అరవింద్ చెబుతున్నారని.. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది అరవిందే అని తీవ్ర విమర్శలు చేశారు. ఇంత వరకు తాను ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని.. నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే.. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అరవింద్‌ను వెంట పడి ఓడిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయ్.. పిచ్చి వేయాలు వేయవద్దని.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మెత్తగా తంతాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డ్ తేలేని అరవింద్.. రైతులకు కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను బాధతో మాట్లాడుతున్నానని..

ప్రజలు తప్పుగా భావిస్తే క్షమించాలని కోరారు.