అనంత గిరి ప్రదక్షిణకు భారీ స్పందన…

0
12 Views

వికారాబాద్: హిందూ జనశక్తి ఆద్వర్యంలో వికారాబాద్ జిల్లా అనంత గిరి కొండలలో ప్రతీ సంవత్సరం నిర్వహించే అనంతగిరి గిరి ప్రదక్షిణ కు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ పాదయాత్ర వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ భవాణీ మాత ఆలయం నుండి ఉదయం 6గంటలకు పాదయాత్ర ప్రారంభమై వికారాబాద్ అనంతగిరి కొండల చుట్టు గోదుమగూడ, జైదుపపల్లి, కెరెల్లి,మరియు బుగ్గరామేశ్వర ఆలయం నుండి అనంతగిరికి చేరుకుంది. అనంతగిరి కొండల చుట్టూ పరిక్రమ ణ కొనసాగింది. ఈ సందర్భంగా హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు లలిత్ కుమార్ , మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం పాదయాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతు మంచి ఆదరణ లభిస్తుందన్నారు . నవాబుపేట్ శ్రీ బాలమార్తాండ మహారాజ్ పాల్గొనగా ఈ ఆధ్యాత్మిక పాదయాత్ర వల్ల ప్రతీ కొత్త పరివర్తన వస్తుందన్నారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, హిందు జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీ నివాస్, బిజెపి వికారాబాద్ జిల్లా అద్యక్షులు సదానంద్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి రామ్ చరణ్ రెడ్డి, శ్రీ మాణిక్య ప్రభు భక్తులు కూడా అధికంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.

 

పాల్లననున్న జడ్పీ చైర్ పర్సన్

వికారాబాద్ లో నిర్వహిస్తున్న గిరి ప్రదిక్షణలో జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి సాయంత్రం పాల్గననున్నారు.