వికారాబాద్ బాలాజీ వైన్స్ లో దొంగతనం పెద్ద మొత్తంలో చోరీ

0
13 Views

వికారాబాద్: వికారాబాద్ ప్రధాన చౌరస్తా అయిన ఎన్ టీ ఆర్ సర్కిల్ ఉన్న బాలాజీ వైన్స్ లో దొంగలు పడగా నగదుతో పాటు విలువైన మధ్యం బాటిళ్లు దొంగలించిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ చౌరస్తా లోని బాలాజీ వైన్స్ మంగళవారం రాాత్రి మూసి వెళ్లడం జరిగిందని అందులో రూ.50 వేల వరకు నగదు ఉండడంతో పాటు విలువైన మధ్యం బాటిళ్లు ఉన్నాయన్నారు. ఉదయం వచ్చి చూసే సరికి పై కప్పు నుంచి ఎవరూ దిగినట్లు ఆధారాలు ఉన్నాయని డబ్బుతో పాటు 2 లక్షల విలువైన మధ్యం దొంగలించారన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని పోలీసులు విచారణ చేపడుతున్నారని వారు తెలిపారు .