ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి: స్వీప్ నోడల్ అధికారి కోటాజీ

0
12 Views

వికారాబాద్ : అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి కోటాజి అన్నారు. మంగళవారం స్థానిక ఎస్.ఏ.పీ. డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై స్వీప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ సమ్మరి రివిషన్ 2023 లో భాగంగా ఈనెల 8వ తేదీ వరకు 18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన విద్యార్థిని విద్యార్తులు అందరూ తప్పని సరిగా తమ పేర్లు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికలలో ప్రతి ఓటరు తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకుంటే అలాంటి వారు ప్రజలకు మంచి సేవకులను అందిస్తారన్నారు. ఈ సందర్బంగా ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం, మార్పులు, చేర్పులు, మృతి చెందిన వారి పేర్లు ఓటురు లిస్ట్ నుండి తొలగింపు తదితర విషయాలపై విద్యార్థులకు అయన అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఏ పి కళాశాలల ప్రిన్సిపాల్, వారి సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.