పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రఘువీర్ రెడ్డి

0
26 Views

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ని నూతనంగా నియమింప బడ్డ పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రఘువీర్ రెడ్డి అభినందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం విరామం లేకుండా పనిచేయాలని సూచించారు, నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ బాధ్యతను తప్పకుండా నిర్వహిస్తానని, మీ ఆదేశానుసారం పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తానని రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు.