దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా:ఎమ్మెల్యే రఘునందన్ రావు

0
24 Views

దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని  పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్షేత్రస్థాయి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు, గ్రామస్తుల కోరిక మేరకు గుడి నిర్మాణానికి తన వంతు పూర్తిగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు  గ్రామస్తులతో సమావేశం ఏర్పరిచి గ్రామంలో ఉన్న సమస్యలను, గ్రామ ప్రజలకు ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా వింటూ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.గ్రామంలో నెలకొన్న విద్యుత్, రెవెన్యూ మరియు ఇతర సమస్యల కొన్ని రోజుల్లో పూర్తి పరిష్కారానికి హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు టీచర్లకు గైర్హాజరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న విద్యా బోధన మరియు వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న పోడు భూముల సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించానని త్వరలో వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగు వేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.