డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పురిటి శిశువు మృతి….

0
22 Views

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పురిటి శిశువు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వంద పడకల ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం కి చెందిన, సయ్యద్ ఇమామ్, చాంద్బి కుమార్తె… సయ్యద్ మాసాబిని పురిటినొప్పులు రావడంతో, మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో 12వ తేదీన అడ్మిట్ చేశారు…డాక్టర్లు నిర్లక్ష్యంగా నార్మల్ డెలివరీ చేస్తామంటూ, 13వ తేదీ నార్మల్ డెలివరీ కాదంటూ డాక్టర్ చెప్పిన, వినకుండా డాక్టర్ శశికళ ఆపరేషన్ థియేటర్లో తీసుకువెళ్లి కొద్దిగా ఆపరేషన్ చేసి నావల్ల కాదు భద్రాచలం తీసుకొని వెళ్ళండి అంటూ చెప్పి 108లో భద్రాచలం తీసుకువెళ్లాగా డాక్టర్లు పరిశీలించి శిశువు మృతి చెందారని చెప్పారు.13వ తేదీ అర్ధరాత్రి రెండు గంటలపాటు ఆపరేషన్ థియేటర్లో, పేషెంట్లను తీసుకువెళ్లి శిశువును మృతి చెందినట్టు చేశారని మాకు న్యాయం చేయాలంటూ గైకాలజిస్ట్ డాక్టర్ శశికళను సస్పెండ్ చేయాలని భాదితులు ఆందోళన చేస్తున్నారు.