వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.: పట్లోళ్ల రఘువీర్ రెడ్డి, టి పి సి సి ప్రధాన కార్యదర్శి

0
18 Views

వికారాబాద్: వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టి పి సి సి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి అన్నారు.తెలంగాణ /కర్ణాటక రాష్ట్ర సమాచారాన్ని దౌర్జన్యంగా తీసుకవేళ్లాడానికి ఈ చర్యలు చేశారన్నారు.    సైబర్ పోలీసులు చేసిన దాడి దౌర్జన్యం పై మేము నాయపోరాటానికి వెళ్తామన్నారు.     కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుకొలు కార్యాలయం పై  పోలీసుల దాడిని , కంప్యూటరు లు సీజ్ చేయడాన్ని ,ఆక్రమముగా వారి సిబ్బందిని అరెస్టలు చేయడం పట్ల  తీవ్రముగా ఖండిస్తున్నామన్నారు.మా కాంగ్రెస్ పార్టీ పై  ముఖ్యమంత్రి  చెపిస్తున్న ఇలాంటి పోలీస్ దాడులకు మేము భయపడేది లేదని ప్రభుత్వం అవలంబిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిపక్ష పార్టీగా మా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్తుంటే ఓర్వలేక  ఈ దాడులు, అక్రమ అరెస్టులు చెయ్యడం ఎంత వరకు సమంజసమన్నారు.ప్రజల్లోకి ప్రజా వ్యతిరేక విధానాలను మేము తీసుకెలుతుంటే కొంత మంది సైబర్ క్రైమ్ పోలీసులు ఇలా వ్యవహరించడం చాలా దారుణమని పేర్కొన్నారు.తెలంగాణ /కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించిన సమాచారాన్ని దౌర్జన్యంగా తీసుకువెళ్లడానికి చేసిన ప్రయత్నం లా మాకు కనిపిస్తుంది ఎలాంటి FIR లేకుండా ఇలాంటి దాడిలు ,అరెస్టలు చేయడం దారుణమన్నారు.మా పిసిసి అధ్యక్షుల పైన మా సీఎల్పీ నాయకుల పైన మా పార్లమెంట్ సభ్యుల పైన మా శాసనసభ్యుల పైన మా కాంగ్రెస్ పార్టీ పైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎన్నో పోస్ట్ పెట్టిన వారిపై మేము చాలా సార్లు కేసులు పెట్టినా పట్టించుకోవడం లేదు, కానీ ప్రభుత్వన్ని నడిపించే వారు చెబితే వెంటనే పోలీసు వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్ వారిపై ఈ విధంగా దాడులు,అక్రమ అరెస్ట్లు  చేయాడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే మేము చూస్తూ ఊరుకొమని హెచ్చరించారు.ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయపోరాటానికి వెళ్ళుతుంది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

*