డ్రగ్స్ కేసు ఎఫ్ ఐ ఆర్ లో నా పేరు లేదు: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

0
18 Views

హైదరాబాద్: ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి మరోసారి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు వచ్చారు. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉందని బండి చేసిన ఆరోపణలపై తడిబట్టలతో వచ్చి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి రుజువు చేయాలని బండికి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే చార్మినార్ వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బండి సంజయ్..పై అలాగే దుబ్బాక ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ నా సవాల్ ను స్వీకరించలేదు.. బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతుందని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు.అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశ్రమల యజమానులను బెదిరించనిదే వందల కోట్లు ఎలా సంపదించారని ప్రశ్నించారు. ఎంఐఎం నేతల తరపున నువ్వు వకల్తా పూచ్చుకోలేదా అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రఘునందన్ రావును ప్రశ్నించారు. అలాగే డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని.. కర్ణాటక పోలీసులు నన్నెప్పుడూ విచారణకు పిలవలేదని.. ఆ కేసు FIR లో కూడా నా పేరు లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.