వికారాబాద్ జిల్లా లో గంజాయి పట్టివేత

0
18 Views

వికారాబాద్ జిల్లా: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన నవాబు పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి నవాబు పేట ఎస్సై భరత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. వికారాబాద్ జిల్లా “నవాబ్ పేట” మండలం “వట్టిమీనపల్లి” వద్ధ తనిఖీ చేస్తుండగా పవన్ కుమార్ అనే యువకుని వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒక నిజం తెలిసింది … గ్రామం లో ఒక పెద్దాయన పేరు మానిక్ రెడ్డి పొలంలో గంజాయి మొక్కలను పెంచి … పవన్ కుమార్ అనే యువకుని ద్వారా…. మార్కెటింగ్ బిజినెస్ మొదలు పెట్టాడు ఒక గ్రాము గంజాయి 400 రూపాయలకు ….గాంజాయి కి బానిసైన యువకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు….ఇదోదో బాగుందని బిజినెస్ మొదలు పెట్టిన ఆదిలోనే  పవన్ కుమార్ పోలీసులకు చిక్కాడు.పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరి రిమాండ్ తరలించారు .ఎది ఏమైనా యువత గంజాయికి బానిసలు కావడం సమాజం ఎటు వైపు పోతుందేమోనని ఇప్పటికైనా తలిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు తెలిపారు .