పూలపల్లిలో ఘనంగా అయ్యప్ప పూజ హాజరైన ఎమ్మెల్యే కాలేే యాదయ్య

0
15 Views

నవాబుపేట : స్వామి యే శరణం అయ్యప్ప నామ స్మరణతో నవాబుపేట మండలం పూలపల్లి గ్రామం మారు మ్రోగింది. గ్రామానికి చెందిన నవాబుపేట మండల మార్కెట్ కమిటీ చైర్మన్  డాక్టర్ జి. ప్రశాంత్ గౌడ్ స్వామి నిర్వహించిన అయ్యప్ప 18వ పడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు . కని విని ఎరుగని రితీలో నిర్వహించిన అయ్యప్ప పూజకు జిల్లా నుంచి స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎటు చూసినా అయ్యప్ప స్వాములు సందడి కనిపించింది. ప్రశాంత్ గౌడ్ స్వామికి రాజకీయంగా పరిచయం ఉండడంతో పెద్ద ఎత్తున ప్రముఖులు ఈ పూజ కార్యక్రమానికి తరలివచ్చారు. అయ్యప్ప స్వాములు నృత్యాలు పాటలతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై డాక్టర్ ప్రశాంత్ గౌడ్ తో కలిసి అయ్యప్ప పడిని కాల్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ స్వామి పూజా కార్యక్రమానికి వచ్చిన ప్రముఖుల అందరిని స్వాములను శాలువాలతో సత్కరించారు. అనంతరం పెద్ద ఎత్తున స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.