ప్రారంభమైన అతిరుద్ర మహా యజ్ఞం

0
9 Views

వికారాబాద్: వికారాబాద్ ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమం అతిరుద్ర మహా యజ్ఞం ఈ కార్యక్రమం ఈరోజు నుండి ప్రారంభం కానుండగా 162 మంది వేద పండితులు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమానికి మహిళలు వికారాబాద్ పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి దైవ కార్యక్రమంలో తలా చేయి వేస్తూ ఏర్పాట్లను పూర్తి చేశారు. పట్టణంలోని మహిళలు ఈ కార్యక్రమానికి సంబంధించిన పూల అలంకరణ కోసం గత రెండు రోజులుగా ఏకధాటిగా కష్టపడుతూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. వారం రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాటు చేసుకొని నిత్య అన్నదాన కార్యక్రమాన్ని సైతం చేపడుతున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహాగణపతి, శత చండి, రాజ శ్యామల మహా సుదర్శన యజ్ఞ ధారాభిషేకం చతుర్వేద పారాయణం నిత్య శాంతి కళ్యాణ ఉత్సవాలు జరుపనున్నారు.