సుదీర్ఘ కాలం ప్రయాణిస్తున్న పార్టీ కాంగ్రెస్: మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

0
25 Views

వికారాబాద్:సుదీర్ఘ కాలం ప్రయాణిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ. బిజెపి దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తుందన్నారు. గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసి దేశ సంరక్షణకు చర్యలు తీసుకుందన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాష్ట్రంలోనూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి సీనియర్ నాయకులు విశ్వనాథం సత్యనారాయణ కిషన్ నాయక్ ఎర్రవల్లి జాఫర్ కృష్ణారెడ్డి వెంకటయ్య రెడ్డి నాయక్ అన్సారి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు