విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

0
14 Views

వికారాబాద్: విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలపై మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించాలని ఆయన తెలిపారు. ప్రణాళికాబద్ధంగా విద్యా బోధనతో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని  సూచించారు. గతంలో పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత శాతం తక్కువగా రావడానికి గల కారణాలు అన్వేషిస్తూ, మంచి ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని  , ఉపాధ్యాయులు తలచుకుంటే నాణ్యమైన విద్యతోపాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చునని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేసుకోవాలని కలెక్టర్ డీఈఓ కు సూచించారు. పరీక్షలు పకడ్బందీగా, కఠినంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. పరీక్షల సమయంలో మండలాల అధికారులను విధుల్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని  తెలిపారు.ఈ అవగాహన సదస్సులో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డిసిఇబి చైర్మన్ అనంత రెడ్డి, ఏసిజిఇ రామ్ రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.