అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

0
16 Views

వికారాబాద్ : శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని సోమవారం ఉదయం కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి  దర్శించుకున్నారు.ఈ సందర్భంగా పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం , ఈఓ టీ.నరేందర్ అనంతరం వేద ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు ఈ సందర్భంగా కేంద్రమంత్రి కి స్వామి వారి ఫోటో బహూకరించారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని , దేవాలయం దగ్గర గల భూమి సమస్య గురుంచి వినతి పత్రం అందజేశారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అలాగే పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేంద్రమంత్రి సుముఖంగా ఉన్నట్లు ఏవో నరేందర్  తెలిపారు. వారి వెంబడి మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే K. S రత్నం  జిల్లా BJP నాయకులు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు