31 Views
వికారాబాద్:ప్రతి ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లిలో జగజ్యోతి బసవేశ్వర విద్యాసంస్థ ప్రాంగణంలో జరిగే రుద్ర పారాయణం, బసవారాధన కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పాల్గొని వీరశైవ సభ్యులతో కలిసి, వీరశైవ సమాజం వికారాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో వీరశైవ సమాజం అధ్యక్షులు విజయ అప్ప , వీరేశం , బీచప్ప , విద్యాసాగర్ , భద్రప్ప , కే టీ సంగప్ప , వీరన్న , దయానంద్ స్వామి , సమాజ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.