ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పార్టీ మారడం లేదు: రాజేంద్రనగర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు రాధాకృష్ణ(కిట్టు)

0
29 Views

హైదరాబాద్: రాజేంద్రనగర్ MLA ప్రకాష్ గౌడ్  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వక భేటీ అయ్యారని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు రాధాకృష్ణ(కిట్టు) తెలిపారు. నియోజకవర్గం రాజేంద్రనగర్ లోగాల శంషాబాద్ మండలం కొత్వల్గుడా, బహదూర్ గూడా, ఘన్సిమియా గూడా గ్రామలో గల భూ సంబంధ సమస్యలు పరిష్కారం చూపాలని అలాగే నియోజకవర్గం అభివృద్ధికి ప్రతేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనికి గాను సీఎం గారు సానుకూలంగా స్పందించారాని తెలిపారు.ఇందులో ఎలాంటి రాజకీయ ఉదేశ్యం లేదని.. కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు వస్తున్నా వార్తలో వాస్తవం లేదని రాధాకృష్ణ తెలిపారు.