జాతీయ రహదారి పై మధ్యం ప్రియుల వాహనాలు..ఇబ్బందులు పడుతున్న ప్రజలు

0
12 Views

జహిరాబాద్ టౌన్:జహీరాబాద్ పట్టణ నడిబొడ్డు నుండి ఉన్న జాతీయ రహదారి పక్కనే వైన్స్ శాపు ఉండడంతో, ఈ రోడ్డు గుండా ప్రయాణించే ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ముంబాయి మధ్యలో ఉన్న ఈ జాతీయ రహదారి పై నుండి భారీ వాహనాలు, టూరిస్టు బస్సులు, ఆయా రాష్ట్రాల ఆర్టిసి బస్సులు, లారీలు, స్థానిక నియోజకవర్గం చుట్టు ప్రక్కన ఉండే మోటార్ సైకిల్ పై ప్రయాణించే గ్రామాల ప్రజలతో రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇలాంటి రోడ్డు ప్రక్కనే వైన్స్ శాపు ఉండడంతో, వైన్స్ కొరకు వచ్చిన మధ్యం ప్రియులు వారి వాహనాలను రోడ్డు పైనే పార్కింగ్ చేస్తున్నారు. దీనితో జాతీయ రహదారిపై కొన్ని సంధర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అక్కడి నుండి ప్రయాణించాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.