మొక్కు చెల్లించుకున్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

0
15 Views

వికారాబాద్: శాసన సభ ఎన్నికల సందర్బంగా తాండూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలిచి వికారాబాద్ జిల్లా కేంద్రం లోని ఆలంపల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం లో ముడుపు కట్టిన బుయ్యని మనోహర్ రెడ్డి. శాసనసభ్యులుగా తాండూర్ నుండి గెలుపొందడం చేత సోమవారం ఉదయం పెద్దేముల్, తాండూర్ నాయకుల తో కలసి ముడుపు విప్పి స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిని నారాయణ రెడ్డి, సాయిని శ్రీనివాస్ రెడ్డి, నర్సిములు, భాస్కర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ తదితరులు వున్నారు.