500లకు వంట గ్యాస్ సిలిండర్ లబ్దిదారులు ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
217 Views

వికారాబాద్:తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన “ మహాలక్ష్మి పథకం రూ 500/- లకు వంట గ్యాస్ సిలిండర్లు “ లో బాగంగా లబ్దిదారులకు వారి పేర్లు, నెంబర్లు సరి చేసుకొనుటకు అవకాశము కల్పిస్తునట్లు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు ఎల్పిజి వినియోగదారుల వివరాల తప్పులను సవరించవలసిందిగా సంబంధిత ఎల్ పి జి గ్యాస్ ఏజెన్సీలకు లకు ఆదేశాలు జారి చేయడం జరిగిందన్నారు. వినియోగదారుల పేర్లు, నెంబర్లు తప్పుగా ఉన్నచో సంబంధిత గ్యాస్ ఎజేన్సిలకు ఆదార్ కార్డు, రేషన్ కార్డు , బ్యాంక్ పాస్ బుక్ తీసుకొని వెళ్లిఇకేవైసి నమోదు చెయించుకొని తదుపరి ప్రజా పాలన సేవ కేంద్రములందు వార్డు ఆఫీస్ లలో ఏంపిడిఓ లతో నమోదు చెయించుకొవలసిందిగా ఆయన సూచించారు. ఇట్టి అవకాశాన్ని ప్రతి వినియోగదారు/లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.