జంతు సంరక్షణ పక్షోత్సవాల కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
17 Views

వికారాబాద్:దేశ వ్యాప్తంగా జంతు సంరక్షణ పక్షోత్సవాలు ఈనెల 14 నుండి 30 వరకు జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి,మిగతా జిల్లా అధికారులతో కలిసి జంతు సంరక్షణ పక్షోత్సవాల కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ జంతు హింసకు పాల్పడకుండా, జంతువుల పట్ల కరుణతో ఉంటూ వాటిని సంరక్షించవలసిన అవసరం ప్రతి పౌరునిపై ఉందని తెలియచేశారు. వికారాబాద్ జిల్లా లో జంతు సంరక్షణ కొరకు సేవచేయు వారికి , స్వచ్ఛంద సంస్థలకు ప్రతి పౌరుడు సహకరించాలని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని, వన్యప్రాణులు కనిపించినట్లయితే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించేందుకు సహకరించాలని, పక్షులు నివసించే ఆవాసాలైన వృక్షాలను నరకరాదని అదేవిధంగా పశువులను , జంతువులను రవాణా చేసే క్రమంలో తప్పనిసరిగా జంతు రవాణా నిబంధనలను పాటించాలని, వీధులలో తిరిగే కుక్కలు, పిల్లులు, ఆవులు తదితర జంతువుల పట్ల కరుణతో వ్యవహరించి వాటికి ఆహారం, త్రాగునీరు అందించాలని వాటిని హింసకు గురి చేయకూడదని, పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలు వేయించాలని కోరుచున్నారు. పెంపుడు జంతువులను అమ్ముట, కొనుట వాటి సంతాన అభివృద్ధి ( బ్రీడింగ్ )చేయడం ద్వారా వ్యాపారం చేయువారు తప్పని సరిగా జంతు సంరక్షణ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ పొందాలని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంగించినట్లయితే శిక్షార్హులు అవుతారాని తెలియచేస్తున్నారు. అలాగే ప్రజలు తినుబండారాలు కలిగిన ప్లాస్టిక్ కోవర్లను రోడ్డు ప్రక్కన మరియు ఆరు బయట పడేయరాదని, జంతువులు అట్టి ప్లాస్టిక్ కోవర్లు, సంచులు తినడం వలన చనిపోయే ప్రమాదం ఉందని తెలియచేస్తున్నారు.వివిధ గవర్నమెంట్ పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో జంతు సంరక్షణ, సంక్షేమం పై నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన 6,7,8,9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేసినారు.ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ, వికారాబాద్ జిల్లా తరపున స్కూల్ పిల్లలకి జంతు సంరక్షణ పై అవగాహణ కల్పించడం, పక్షుల కొరకు జామూన్, వేప, రావి ఇతర మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహణ కల్పించడం మరియు పశువైద్య క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందని తెలియచేస్తున్నారు. ప్రతీ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితముగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తారని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.