మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
39 Views

వికారాబాద్:భారత స్వతంత్ర పోరాటంలో ఎందరో మహానీయులు తమ ప్రాణాలను అర్పించి అమరులుగా నిలిచారని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, బావి తరాలకు తెలియపరచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అమరులను స్మరిస్తూ రెండు నిమిషాల మౌనాన్ని పాటించారు. జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.