భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ:మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

0
16 Views

వికారాబాద్:అహింస మార్గమే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ  అని  వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు.మంగళవారం మహాత్మాగాంధీ  వర్ధంతి సందర్భంగా  గాంధీ పార్క్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ , ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.