28 Views
వికారాబాద్:పట్టణంలోని పాన్ షాపులలో దుకాణాలలో ఎసరైన నిషేదిత గుట్కా, మత్తు పదార్థాలు, తాగుటకు వినియోగించే యంసీ, ఓఆర్సీ పేపర్లు, నిషేదిత సిగరెట్లు, హుక్క పరికరాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వికారాబాద్ టౌన్ సీఐ టి.శీను తెలిపారు. ఈమేరకు మంగళవారం వికారాబాద్లో సీఐ తన సిబ్బందితో కలిసి పాక్షాపులలో, దుకాణాలతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహబూబ్, షఫీ ఉల్లా పాన్ షాపులలో నిషేదిత గుట్కా, యంసీ, ఓఆర్సీ పేపర్లు, నిషేదిత సిగరెట్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.