అంతర్ జిల్లా బైక్ దొంగ అరెస్ట్ …12 బైకులు స్వాధీనం.. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

0
20 Views

వికారాబాద్: మూడు నెలల కాలంలోనే 12 బైక్ లను దొంగలించిన పాత నేరస్తున్ని పట్టుకుని బైక్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శనివారం సీసీ ఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బంట్వారం మండలం తొర్మామిడి గ్రామానికి చెందిన మాణిక్యం గతంలో 13 కేసులలో 10 సార్లు జైలుకు వెళ్లడం జరిగిందని, అక్టోబర్ నెలలో జైలు నుంచి వచ్చిన మాణిక్యం మూడు నెలల కాలంలో 12 బైకులను దొంగలించారని , 10 బైకులను సైబరాబాద్ పరిధిలో దొంగలిస్తే ఒకటి సంగారెడ్డి, మరోకటి వికారాబాద్ పరిధిలో దొంగలించి తొర్మామిడిలోని ఆయన వ్యవసాయ పొలం వద్ద వాటిని దాచడం జరిగిందన్నారు. వికారాబాద్ లో తనిఖీల్లో భాగంగా మాణిక్యంను పోలీసులు ఆపి బైక్ పేపర్ల గురించి అడుగగా పొంతన లేని సమాధానం రావడంతో అనుమానంతో విచారించగా అసలు విషయం బయట పడిందన్నారు. అతనితో పాటు బైక్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. ఈ కేసులో కీలకంగా పని చేసిన సీసీఎస్ పోలీసులను అభినందించారు.