నేవీ రాడార్​ స్టేషన్​ దామగుండంలో వద్దు… వేరే దగ్గరకి మార్చండి…రూల్​ 377 కింద లోక్​సభలో లేవనెత్తిన ఎంపీ డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి

0
16 Views

వికారాబాద్​ జిల్లా… చేవెళ్ళ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని పరిగి అసెంబీ కాన్సిస్టుయెన్సీ పూడురు మండలం దామగుండంలో నేవీ రాడార్​ స్టేషన్​ నిర్మాణం వద్దని… దాన్ని వేరే దగ్గరికి మార్చాలని బీఆర్​ఎస్​ ఎంపీ డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. దామగుండంలో రాడార్​ స్టేషన్​ నిర్మించడం వల్ల 400 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉందన్నారు. దాంతోపాటు, ఈ రాడార్​ స్టేషన్​ ఏర్పాటు అయ్యాక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయని స్పష్టం చేశారు. పూడురు మండల ప్రజానీకం నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ రూల్​ 377 కింద లోక్​సభలో ప్రత్యేకంగా రంజిత్​ రెడ్డి లేవనెత్తారు. స్థానిక ప్రజలు ఆందోళనలను పరిశీలించి… కేంద్ర రక్షణ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచన చేశారు. నేవీ రాడార్​ స్టేషన్​ను అక్కడి నుంచి మార్చి వేరే అనువైన ప్రదేశాలని మార్చాలని కోరారు. ఈ విషయంపై స్థానిక ప్రజలు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.