బీఆర్ఎస్ కు షాక్…. కాంగ్రెస్ లోకి పట్నం ప్యామిలీ … ఎంపీగా పోటీ చేయాలని సూచించిన కాంగ్రెస్

0
21 Views

వికారాబాద్ : ఎన్నాళ్ళో జిల్లా ప్రజలు, పట్నం అభిమానులు ఎదురు చూసిన శుభపరిణామం రానే వచ్చింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ‘పట్నం’ ఫ్యామిలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ , మాజీ మంత్రి పట్నం మహేంధర్ రెడ్డి , హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి , యువ నాయకుడు పట్నం రినీష్ రెడ్డి కలిసి చర్చించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీగా సునీతారెడ్డి  పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. ఈ నెల 11లోపు పార్టీ లో చేరే అవకాశం ఉంది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క , మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఉన్నారు*