అధికారులకు ఎలక్షన్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు: పీవోడబ్ల్యూజిల్లా కార్యదర్శి వై. గీత

0
41 Views

వికారాబాద్:  ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎలక్షన్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద ఎందుకు చూపించడం లేదని పీవోడబ్ల్యూజిల్లా కార్యదర్శి వై. గీత డిమాండ్ చేశారు. కొత్త గడి
బాలికల రెసిడెన్షియల్ వసతి గృహంలో తరుచుగా జరుగుతున్న సంఘటనల పట్ల ఉన్నతాధికారులు స్పందించడం లేదన్నారు. గత పది సంవత్సరాలుగా చీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థి సంఘాలను, మీడియాను అనుమతించక పోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గతంలో ఓ బాలిక మరణిస్తే అనారోగ్య సమస్యలు అని చెప్పి తప్పించుకున్నారని గుర్తు చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతుంటే వారి భవిష్యత్తు ఏమిటన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వసతి గృహంలో తనిఖీ చేయాలని ప్రిన్సిపల్. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పీవోడబ్ల్యూ ఆధ్వధ్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.