కొత్తగడి పాఠశాలను సందర్శించిన ప్రజాప్రతినిధులు

0
15 Views

వికారాబాద్:: కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని పత్రికల్లో కథనాలు రావడంతో వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల, మునిసిపల్ ప్లోర్ లీడర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి వెళ్లి సంఘటన కు సంబందించిన వివరాలపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల ప్రిన్సిపల్  అపర్ణను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరి  వెంటా స్థానిక కౌన్సిలర్ వేణు, మురళి, నాయకులు కిషన్ నాయక్. అనంత్ రెడ్డి, కిందొ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.