మహబూబ్‌నగర్ నుండి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం…6న ప్రజా దీవెన సభ

0
32 Views

అనంతగిరి డెస్క్ : వచ్చే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్దమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న పాలమూరు ప్రజా దీవెన సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంతో పాటు చేవెళ్ల పార్లమెంట్ స్థానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈ రెండు స్థానాలు తప్పకుండా గెలుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ముందుకు వెళుతుంది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి సునీతా రెడ్డి బరిలో నిలుస్తుండగా మహబూబ్ నగర్ నుంచి టిక్కెట్ ఆశీస్తున్న వంశీచంద్ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.