వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి

0
15 Views

వికారాబాద్  : చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని పట్నం సునీతారెడ్డి నివాసం రోజు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో కోలాహలంగా మారింది. శనివారం చేవెళ్ల, వికారాబాద్ చెందిన వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు సునీతారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జీ భీమ్ భరత్ ఆధ్వర్యంలో భారీగా టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెసులో చేరారు. అంతకు ముందు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి వందలాదిమంది ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరుతామని స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. చేవెళ్లలో అన్ని సామాజిక వర్గాల మద్దతు తనకు లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెసులో చేరిన వారిలో మొయినాబాద్, చేవెళ్ల, నవాబుపేట, వికారాబాద్ కు చెందిన కార్యకర్తలు ఉన్నారు