పరిగి విజ్ఞాన్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
14 Views

వికారాబాద్:ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు.సోమవారం జిల్లా లో పరిగి మండలం విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసారు. కేంద్రంలో సీసీ కెమెరాలు, వసతులు, పరీక్షా నిర్వహణ తీరును ఆరా తీశారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కు అధికారులు వివరించారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకురాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.పరీక్షా కేంద్రంలో మొత్తం 267 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 261 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరయ్యారని, 06 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు. ఏం ఆర్ ఓ ఆనంద రావు , కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య చీఫ్ సుపరిండెంట్ మక్బూల్ , డి ఓ లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.