ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వాదాన్ని తీసుకెళ్లి దొరల కాళ్ల కాడ పెట్టడం అనైతికం:వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ పార్టీ కన్వీనర్ రవీందర్ మహారాజ్

0
12 Views

వికారాబాద్:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వాదాన్ని తీసుకెళ్లి దొరల కాళ్ల కాడ పెట్టడం అనైతికమని వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ పార్టీ కన్వీనర్ రవీందర్ మహారాజ్ అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారాధన్ మహరాజ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. తన సప్రయోజనం కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాలు వదిలి సన్యాసం తీసుకోవాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు మల్లికార్జున్ , యాదగిరి, వెంకటేశ్ , శ్రీనివాస్ , శేఖర్ , అశోక్ , మల్లేష్ , రాజు, సత్యం , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు