10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికి బెస్ట్ అఫ్ లక్:జిల్లా ఎస్పీ కోటి రెడ్డి

0
39 Views

వికారాబాద్: జిల్లాలో రేపటి నుండి మొదలవుతున్న 10 వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 10 వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాల దగ్గర పాటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర ఎవ్వరు గుంపులు గుంపులుగా గుమికుడి ఉండవద్దని పరీక్ష కేంద్రాల లోపలికి సెల్ ఫోన్ తీసుకోని వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు పరీక్ష సమయం లో మూసివేసుకోవాలని ఎవరైనా పరీక్ష కేంద్రాల దగ్గర చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణం లో పరీక్షలు రాయాలని, ఎలాంటి భయందోలానాలకు లోనుకకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలని, విద్యార్థులందరు సమయపాలన పాటిష్టు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలన్నారు. ఎక్కడ ఎవరికైనా ట్రాఫిక్ ఇబ్బందులు కల్గితే డైల్ 100 కి కాల్ చేసి పోలీస్ అధికారులకు తెలియజేయాలనీ ఎస్పీ తెలిపారు.