కల్తీ లడ్డు దోషులను శిక్షించాలి:అనంతగిరి జిల్లా విశ్వహిందూ పరిషత్

0
78 Views

వికారాబాద్ :తిరుమల లడ్డు లో జరిగిన కల్తీ సందర్బంగా వికారాబాద్ అనంతగిరి జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది హిందూ బంధువులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాధు సమితి అధ్యక్షులు శంకర్ స్వామీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లడ్డు కల్తీ చేసిన దోషులను వెంటనే శిక్షించాలని,దేవాలయాల నుండి అన్య మతానికి చెందిన ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలని, తెలంగాణలో కూడా దేవాలయాల్లో ప్రసాదాలను పరీక్షించాలని, దేవాలయ పాలన విభాగాల్లో ఆధ్యాత్మికవేత్తలకు చోటు కల్పించాలని, దేవాదాయ శాఖను వెంటనే రద్దు చేయాలని, దేవాలయాలపై పెత్తనాన్ని తొలగించుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.అనంతరం అందరు కలసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో బి జె పి జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి,బసిరెడ్డిపల్లి కృష్ణ స్వామి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్, కార్యదర్శి శ్రీలత రెడ్డి, సహకార దర్శి ప్రభాకర్ గౌడ్, దోమ శ్రీకాంత్ హిందూ సంఘాల నాయకులందరూ పాల్గొన్నారు.