మంత్రి పొన్నం ప్రభాకర్ డౌన్ డౌన్ అంటూ కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల నినాదాలు

0
18 Views

అనంతగిరి డెస్క్:   కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావడం వల్ల భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇదే రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో ఆలయ వర్గాలు దర్శనాల క్యూలైన్‌లను నిలిపివేశారు. మంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి మల్లన్నకు మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు గంట సమయం పట్టింది. అప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న భక్తులు అసహనానికి గురవడంతో, మంత్రిని చూసి భక్తులు ‘మినిస్టర్’ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్ ‘అయిపోయింది.. అయిపోయింది’ అంటూ భక్తులకు చేతులు చూపిస్తూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికీ వ్యతిరేక నినాదాలు కొనసాగుతుండటంతో ఆలయ కమిటీ సభ్యులు కొందరు కొమురవెల్లి మల్లన్నకు జైజై అంటూ.. భక్తులు చేస్తున్న వ్యతిరేక నినాదాలు ఇతరులకు వినపడకుండా కవర్ చేశారు.