కొత్లాపూర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

0
33 Views

వికారాబాద్ (మర్పల్లి): పూర్వ విద్యార్థులు అందరూ ఒక చోట చేరి సందడి చేశారు.. ఆనాటి మధుర జ్ఞాపకాలు తీపి గుర్తులను చర్చిస్తూ ఆనందంగా గడిపారు. వికారాబాద్ నియోజకవర్గ మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామం జడ్పీహెచ్ఎస్ పాఠశాల 10వ తరగతి 2008-09 విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనాడు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా విద్యార్థులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహులు, ఉపాధ్యాయులు రాఘవేందర్, అంజయ్య, నర్సింహులు, అనిత, స్నేహలత, హైమావతి తోపాటు విద్యార్థులు దత్తేశ్వర్, రాచన్న, నాగేష్ బాబు, అంబేద్కర్, కృష్ణ, నవీన్, పుల్లారెడ్డి, అరవింద్, లక్ష్మి, రాజేశ్వరి ,స్వప్న, శ్వేత తదితరులు పాల్గొన్నారు.