శాసనమండలి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

0
21 Views

కోడంగల్ : శాసనమండలి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కొడంగల్ పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం లో 56 మంది ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితాలోని పేర్లను సరిచూసుకొని పోలింగ్ కేంద్రంలోకి ఓటరుకు ప్రవేశం కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రం వద్ద మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యుత్తు అంతరాయం లేకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ తో పాటు కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తాండూర్ ఆర్డీవో శ్రీనివాసరావు, తహసిల్దార్ విజయ్, ఎంపీడీవో ఉషశ్రీ, తదితరులు పాల్గొన్నారు