AKR డీఎస్సీ స్టడీ మెటీరియల్ ని ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
30 Views

వికారాబాద్:  పేద మధ్యతరగతి నిరుద్యోగులకు ఉన్నతమైన శిక్షణనిస్తూ వికారాబాద్ జిల్లాలో పేరుగాంచిన AKR స్టడీ సర్కిల్ కు సంబంధించిన 10 పుస్తకాలతో కూడిన DSC- SGT, స్కూల్ అసిస్టెంట్ స్టడీ మెటీరియల్ ను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే  గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అందని ద్రాక్షలా ఉన్న సమయంలో పేద, మధ్యతరగతి నిరుద్యోగులకు ఉన్నతమైన శిక్షణ ఇచ్చి జిల్లాలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలను అందించినటువంటి స్టడీ సర్కిల్ ఏకే ఆర్ స్టడీ సర్కిల్ అని, అలాంటి స్టడీ సర్కిల్ డీఎస్సీ మెటీరియల్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగులు AKR స్టడీసర్కిల్ మెటీరియల్ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమణ   మాట్లాడుతూ విద్యా వ్యాపారంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్య వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో అందించాలని ఉద్దేశంతో నెలకొల్పిన సంస్థ ఏకేఆర్ స్టడీ సర్కిల్ అని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిరుద్యోగులు సులభంగా ఉద్యోగాన్ని పొందేందుకై నిష్ణాతులైన అధ్యాపక బృందం ఎంతో శ్రమపడి ఈ యొక్క పది పుస్తకాల స్టడీ మెటీరియల్ ని రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ స్టడీ మెటీరియల్ శిక్షణ పొందిన వారికిమరియు పొందలేని వారికి అందరికీ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్  , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి  , 31 వ వార్డు కౌన్సిలర్ మాల గాయత్రి లక్ష్మణ్  , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ కుమార్   మాజీ జెడ్పిటిసి పిల్లారం మైపాల్ రెడ్డి  , సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరోత్తం రెడ్డి  , అరుణ్ కుమార్   నాయకులు మాలే లక్ష్మణ్ గుప్తా  , రెడ్యా నాయక్  , ,ప్రదీప్ గారుతదితరులు పాల్గొన్నారు.