చేవేళ్ళ ప్రాంత అభివృద్ధియే నా కర్తవ్యం : ఎంపీ రంజిత్ రెడ్డి

0
15 Views

నాలుగున్నరేoడ్లు ఇంట్ల పడుకొని… ఎన్నికల ముందు పాదయాత్ర ఎవరికోసం?*

*కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్*

*చేవేళ్ళ ప్రాంత అభివృద్ధియే నా కర్తవ్యo*

*కంఠంలో ప్రాణమున్నంత వరకు చేవెళ్ల ప్రజలకి ప్రజాసేవ చేస్తా

*తాండూర్ కాంగ్రెస్ బూత్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి

 

తాండూర్:  నాలుగున్నరేoడ్లు ఇంట్ల పడుకొని… ఎన్నికల ముందు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ పాదయాత్ర ఎవరికోసo చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన పాదయాత్ర కేవలం పదవీ కోసమే తప్ప… ప్రజల కోసo కాదని రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధియే తన కర్తవ్యమని లోక్ సభ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన గొంతులో ప్రాణమున్నంత వరకు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. ఆదివారం తాండూర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులు, స్థానిక ఎంఎల్ఏ బి. మనోహర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ బూత్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…. కొత్త, పాత కలయికతో కార్యకర్తలందరూ కలసికట్టుతో పని చేయాలని సూచించారు. చేయి చేయి కలిపి ఈ చేవేళ్ళ గడ్డ మీద కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేద్దామన్నారు. తన ప్రాంత ప్రజలకు మరింత సేవ చేసేందుకు పార్టీ మారితే దాన్ని పలువురు రాజకీయ అవకాశం అనడం సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అంది వచ్చిన అవకాశాలను తీసుకొని ప్రజలకు సేవ చేయడమే ఏ రాజకీయ నేతకైనా ప్రధాన కర్తవ్యమని ఆయన వివరించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎంఎల్ఏ టీ రాoమోహన్ రెడ్డి, రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతా తదితరులు పాల్గొన్నారు.