వికారాబాద్ రాజీవ్ నగర్ లో కార్డెన్ సర్చ్ …35 వాహనాలు సీజ్

0
18 Views

వికారాబాద్:మన చుట్టు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న, గంజాయి వంటివి సరఫరా లేదా విక్రయాలు జరుగుతున్న పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ నగర్ లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన దృవపత్రాలు లేని 35 వాహనాలు సీజ్ చేశారు. అందులో ఆటోలు, బైక్ లు ఉండగా వాటికి సంబందించి దృవపత్రాలను తీసుకొచ్చి చూపించి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మన ఉండే ప్రదేశాల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే వారి పై దృష్టి పెట్టి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్డెన్ సర్చ్ లో సీఐ , పది మంది ఎస్ఐలు, 65 మంది కానిస్టేబుల్స్, ఆరు మంది హోంగార్డులు పాల్గొన్నారన్నారు.