తాండూరు పోలీసుల తనిఖీల్లో రూ. 9.39 లక్షలు పట్టుకున్న పోలీసులు

0
19 Views

తాండూరు : లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్టుల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నుంచి తొమ్మిది లక్షల 39 వేల రూపాయలను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మల్రెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన జేట్టూరు బసవరాజ్ ఎలాంటి అనుమతులు లేకుండా రూ.9లక్షల 39 వేల రూపాయలను వాహనంలో తీసుకెళ్తుండగా గుర్తించిన పోలీసులు డబ్బులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.అట్టి డబ్బులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీకి పంపినట్లు తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి తెలిపారు. రూ.50వేల నగదు కంటే ఎక్కువ డబ్బులు, విలువైన వస్తువులను తీసుకెళ్తున్న సమయంలో వాటికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని లేనిచో విలువైన వస్తువులు, డబ్బులను సీజ్ చేయడం జరుగుతుందని డిఎస్పి బాల కృష్ణ రెడ్డి పేర్కొన్నారు.