బాధిత కుటుంబాలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సాయం

0
20 Views

వికారాబాద్: మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్ గ్రామానికి చెందిన డప్పు రాజు ప్రమాద వశాత్తు చెట్టు పై నుంచి పడి మృతి చెందాడు.. అదే విదంగా వీర్లపల్లి గ్రామంలో నదిమిదోడ్డి దుర్గయ్య అనారోగ్యముతో మంగళవారం సాయంత్రం మృతి చెందాడు.. అదే గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. అట్టి విషయం తెలుసుకుని ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి   వారి అంత్యక్రియలకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల చొప్పున 15 వేల రూపాయలు పంపగా పట్లూర్ లో ఎంపీటీసీ మొరంగపల్లి స్వప్న సురేశ్   మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి 5 వేల నగదు అందజేశారు.. వీర్లపల్లి లో స్థానిక నాయకులు గ్రామస్తులతో కలిసి మృతుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు.. ఈ కార్యక్రమంలో బాలు, లక్మయ్య, పీటర్, దుబాయ్, దిలీప్, సుధాకర్, అరుణ్, G. నారాయణరెడ్డి చుక్కా రెడీ.B మధుసూదన్ రెడ్డి ఈ.వెంకట్ E. ప్రవీణ్ పాల్గొన్నారు.