రాముడిని మొక్కుతాం… బీజేపీని తొక్కుతాం… మాపోటీ బీజేపీతోనే : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
16 Views

వికారాబాద్: రాముడిని మొక్కుతాం  బీజేపీని తొక్కుతామని మా పోటీ బీజేపీతోనేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం వికారాబాద్ గౌలికార్ ఫంక్షన్ హాల్ లో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా వికారాబాద్ నియోజకవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ . 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించుకుంటే  విశ్వాసం లేని వ్యక్తి  అయ్యాడని,  2019లో రంజిత్ రెడ్డి గెలిపిస్తే ఆయన రన్నింగ్ రెడ్డి అయ్యాడని పేర్కొన్నారు. మీరు కష్టపడి వాళ్ల ముఖాలు తెలియక పోయిన గెలిపించారని  తెలిపారు.  వాళ్లు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారని ఒకరికి మోడీ, మరోకరికి రేవంత్ రెడ్డి ఉన్నారని అనుకుంటున్నారన్నారు.  తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినోళ్లు ఇద్దరని  రంజిత్ రెడ్డి ఎక్కువ మోసం చేశారన్నారు.    సమావేశాలు పెట్టుకుందామని రంజిత్ రెడ్డే చెప్పాడని కానీ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన కూడా మోసం చేశారన్నారు.  మహేందర్ రెడ్డి అన్న నీ భార్య తప్పు చేసింది ఆనంద్ ను ఓడించింది. యాదయ్యను, పైలేట్ ను ఓడించే ప్రయత్నం చేసిందని చెప్పడం జరిగిందని, పరిగిలో వారి యాక్టింగ్ ఆస్కార్ ను మించి ఉండేదన్నారు. పోయిన వారు పోయిన గుండె దైర్యంలో ఎవనికి తక్కువ కాదని కాసాని జ్ఞానేశ్వర్ ముందుకు వచ్చారన్నారు.   వచ్చే ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.