మాటలు నిలుపుకునే నేత మోదీ :చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
25 Views

వికారాబాద్: ప్రజలకు మాట ఇస్తే ఆ మాటను నిలుపుకునే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ మాత్రమేనన్నారు చేవెళ్ల లోక్ సభ బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వికారాబాద్ నియోజకవర్గంలోని బంట్వారం మండలంలో ఆయన శుక్రవారం ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. మండలంలోని బోపునారం, తుర్మామిడి, రొంపల్లి, సల్బత్ పూర్ గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.అయోధ్యలో రామ మందిరం కట్టిస్తానని మాట ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రజలందరు సహకారంతో ఆ మాట నిలుపుకున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రామమందిరాన్ని కట్టిన ఘనత నరేంద్ర మోడీకి మాత్రమే దక్కుతుందని ఆయన తెలిపారు దేశము మొత్తం మరోసారి మోడీ పాలన కోసం ఎదురు చూస్తోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు స్కాంలు చేయడం తప్ప ప్రజల కోసం స్కీములు అమలు చేయడం తెలియదని ఎద్దేవా చేశారు. మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గం నుంచి బిజెపికి అత్యధిక మెజార్టీ రావాలని కొండ విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.ప్రజా ఆశీర్వాద యాత్రలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి, తాండూరు నియోజకవర్గం కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు మహేష్ యాదవ్, సీనియర్ నాయకులు విజయరాజు, బూత్ ఇన్చార్జీలు సురేష్, భాను, నరసింహులు, కొండ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.