వీరశైవ లింగాయత్ అధ్యక్షుడిగా సంతోష్

0
37 Views

వికారాబాద్ : వికారాబాద్ వీరశైవ లింగాయత్ అధ్యక్షుడిగా దోమ సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆలంపల్లి కెంపిన మఠంలో దుద్దిని పీఠాదిపతి చెన్న బసవ ప్రభు స్వామి సమక్షంలో నిర్వహించిన యువదళ్ ప్రత్యేక సమావేశంలో 2024-26 సంవత్సరానికి సంబంధించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా తొండపల్లి సంతోష్, గొల్లెన్ అమర్, ప్రధాన కార్యదర్శిగా మఠపతి అఖిల్, సంయుక్త కార్యదర్శులుగా సదాశివుని సంతోష్, గాండ్ల విక్రమ్, కోశాధికారి సుధీర్ పటేల్, కార్యనిర్వహక కార్యదర్శులుగా మఠపతి రాకేష్, శెట్టి మహేష్, ప్రచార కార్యదర్శులుగా కోటపల్లి సంతోష్, యాలాల కోటిలింగం,అధికార ప్రతినిధి జాక వెంకటేష్, కార్యదర్శులుగా కోల్కొంద భానుచందర్, గాజుల సంతోష్, కూర అమర్ నాథ్, ముఖ్య సలహాదారులు మఠం చంద్రశేఖర్, గుండుమల్ల కిషోర్, కార్యనిర్వహక సభ్యులు కిరణ్ కుమార్,గాండ్ల సంతోష్, సందీప్, పట్నం జగదీష్ లు ఎన్నికయ్యారు. ఆదివారం ఎన్నేపల్లి బసవేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కార్యవర్గం పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు ఎన్ బసవరాజ్, వీరశైవ సమాజం అధ్యక్షుడు అప్ప విజయ కుమార్, ఆత్మలింగం,వీరేశం, దయానంద స్వామి, బసవరాజ్, సుధాకర్, జొన్నాల రవిశంకర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.