వికారాబాద్ లో రైలు కింద పడి వ్యక్తి మృతి

0
15 Views

వికారాబాద్ : : రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్
పట్టణం రామయ్యగూడ గ్రామానికి చెందిన మగ్గ మనోహర్ (24) పశువుల మేపుతూ జీవనం సాగిస్తుండే వాడు. ఈ మధ్యనే పశువులు మేపడం మానేసి కూలీ పనులకు వెళుతుూ మద్యం తాగడానికి బానిసైన మనోహర్ రాత్రి ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్లాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో రామయ్యగూడ  రైల్వే పట్టాలపై  మనోహర్ రైలు కింద పడి చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వెళ్లి చూసే సరికి మనోహర్ గుర్తించారు. అయితే రాత్రి గుర్తు తెలియని రైలు కింద పడి మనోహర్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని
వికారాబాద్ మార్పురికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.