శ్రీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

0
33 Views

వికారాబాద్:భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రీ సత్యసాయి సేవాసమితి వికారాబాద్ లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గాను ఎన్టీఆర్ చౌరస్తాలో తాండూర్ రోడ్ లో చలివేంద్రాన్ని మిషన్ హాస్పిటల్ డాక్టర్ జయంతిక జ్ఞాని, డాక్టర్ సత్యనారాయణ గౌడ్  ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థలు ప్రజలకు అవసరమయ్యే అనేక రకాల సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతూనే ఉంటాయన్నారు. అలాగే వేసవికాలం ముగిసేంతవరకు ప్రయాణికులకు ప్రతిరోజు చల్లని మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్, జిల్లా డివైసి బసవేశ్వర్, వేణుగోపాల్,సత్యం,లక్ష్మణ్, భీమ్ రెడ్డి,సుధీర్,కిషోర్,భాను సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.